Sunday, July 18, 2010

ప్రభుత్వంపై సోంపేట ప్రజల తిరుగుబాటు!

 ఈ వారంలో నాకు అమితానందాన్నిచ్చింది ఓ వార్త!

 శ్రీకాకుళం జిల్లాలో సోంపేట ప్రజల తిరుగుబాటు!

 వారి జీవనోపాధి పోతుందనో, బ్రతుకుతెరువు కష్టమనో వారి
 పోరాటం కావచ్చు!

 పర్యావరణ పరంగా అక్కడ జరగబోయే నష్టాన్ని ఆపడానికి
 ఈ ప్రభుత్వ వ్యతిరేక పోరాటానికి అందరూ సహకరించాల్సిందే!
 వారిని అభినందించాల్సిందే!

 సోంపేట ఉద్ధానం ఏరియా నేను చూశాను! ఎంతటి పచ్చదనం!
 ఆ చిత్తడి నేలలలోనా థర్మల్ పవర్ స్టేషన్ పెట్టేది!

 ఎంత ఘోరం! ఈ వన సంపద అంతా భవిష్యత్తులో బూడిద మయం
 అవుతుందనే నిజం ఎవరైనా జీర్ణించుకోగలరా?

 విద్యుత్ అవసరాలు పెరుగుతున్నాయ్! ఆ కర్మాగారాలు పెట్టుకోడానికి
 ఇటువంటి భూములే కావలసి వచ్చాయా?

 ఈమద్యే వార్తల్లో చదివాను-2012 నాటికి అమెరికాలో బొగ్గు ఆధారిత
 పవర్ ప్లాంట్లు మూసివేస్తారని!

 మనం అంత గొప్ప నిర్ణయాలు తీసుకోలేకపోయినా, కనీసం పర్యావరణాన్ని
 దృష్టిలో పెట్టుకొని నడచుకొంటే మంచిది!

 సంకుచిత, స్వార్దపూరిత రాజకీయాలను ఇప్పటికైనా ఈ ప్రజా ప్రభుత్వాలు
 విడనాడి అమాయక, సామాన్య ప్రజల హృదయస్పందన అర్ధం చేసుకుంటాయని ఆశిద్దాం!    
    

 

No comments: