Saturday, September 26, 2009

అడవిలో స్మృతివనం!

నల్లమలలో మరణించిన వైయస్సార్ జ్ఞాపకార్థం ఓ స్మృతివనం అక్కడే 1412.12 హెక్టారుల్లో నిర్మిస్తారుట! -కేబినెట్ నిర్ణయం! - మంచిదే! దీనికోసం 3.15 కోట్లు ( ముందుగా ) ప్రజాధనం కేటాయించారు! - బాధ లేదు! బాధ పడాల్సిందల్లా ఇప్పటివరకూ బాగావున్న, దట్టమైన అరణ్యం ఏమవుతుంది? రోడ్లకోసం, కాటేజీలకోసం విశృంఖలంగా అక్కడున్న చెట్లను నరికేయడం, ఆ తర్వాత జనసంచారం వల్ల వన్యమృగాలకు రక్షణ లేక అంతరించిపోవడం, పార్కు చుట్టూ వుండే స్థలాల రాజకీయ ఆక్రమణలు.........ఓహ్! పర్యావరణం దెబ్బతింటుందేమో? అటవీ విస్తీర్ణం తగ్గిపోదూ? ఎలాగూ కాంక్రీటు జంగిళ్ళలో భారీ విగ్రహాలు (ఆప్రక్కనే ప్రస్తుతం వున్న జాతిపిత విగ్రహాలు చిన్నబోయేలా!) స్థాపిస్తూ స్వామి భక్తి చాటుకుంటున్నారు కదా! ఇంకొన్ని కూడా సిటీలలో అన్నిసందుల్లో నిర్మించుకుంటే పోయె! 
అడవి మీద పడడం ఎందుకు? ఏమంటారు?

1 comment:

KUMAR.G said...

హాట్సాఫ్!సార్ మీరు నిజమైన ప్రకృతి ప్రేమికులు.